24 August, 2026 | 10:22 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలి

29-09-2025 01:13 AM

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

ముషీరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రాన్ని, రాజ్యాంగ వ్యవస్థలపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరగూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ ల రిజర్వేషన్లకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించా ల్సిందేనని అన్నారు.

42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 9పైన ఓసీలు కోర్టుకు వెళ్ళడం జరిగిందని, దీన్ని అధిగమించాలని, అవనరమైతే గవర్న ర్, కేంద్ర ప్రభుత్వాలను నిలదీయాలని సూచించారు. విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడువుకోవాలని చూస్తే బిసిలు తగిన గుణపాఠం చెవుతారని హెచ్చరించారు. తమిళనాడు తరహలో బిసిలకు చట్టబద్దమైన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ  నాయకులు, న్యాయవాదులు  నాగుల శ్రీనివాస్ యాదవ్, జక్కుల వంశీకృష్ణ, అరుణ్ యాదవ్, నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.