10-07-2025 01:01:15 AM
- తోల్కట్టలోని మహాలక్ష్మి స్వీట్ హౌస్ సీజ్
చేవెళ్ల, జూలై 9: సమోసాలో బల్లి రావడం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్కు చెందిన ఇద్దరు యువతులు బుధవారం మొయినాబాద్ మండలం తోల్కట్ట గేటు వద్ద ఉన్న మహాలక్ష్మి స్వీట్ హౌస్లో రెండు సమోసాలు కొన్నారు. ఇంటికి వెళ్లి ఒక సమోసా తిన్న తర్వాత, మరో సమోసాను తెరిచి చూస్తే అందులో బల్లి కనిపించడంతో షాక్కు గురయ్యారు.
ఒక యువ తి వాంతి చేసుకోగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లా రు. అనంతరం బల్లి ఉన్న సమోసాతో స్వీట్ హౌస్ దగ్గరికి వచ్చి ప్రశ్నించగా.. ఓనర్ షాప్కు తాళం వేసి పారిపో యాడు. తర్వాత ఎంపీడీవోకు సమాచారం ఇవ్వగా సిబ్బందిని పంపించి షాప్ను సీజ్ చేయించారు. అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.