10-07-2025 01:02:58 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 9 (విజయక్రాంతి): లఘు ఉద్యోగ భారతి వార్షిక సర్వసభ్య సమావేశం హైదరాబాద్లోని ఇతిహాస హోటల్లో బుధవారం నిర్వహించా రు. ఈ సమావేశంలో గత రెండు సంవత్సరాల సంస్థ ప్రగతి, ఆర్థిక నివేదికను సమ ర్పించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా లఘు ఉద్యోగ భారతి అఖిల భారత సంఘటన కార్యదర్శి ప్రకాష్ చంద్ర హాజరై తెలంగాణ ప్రాంత లఘు ఉద్యోగ భారతి నూతన కమిటీని ప్రకటించి, మార్గదర్శనం చేశారు.
ప్రత్యేక అతిధిగా తమిళనాడు నుంచి వచ్చిన లఘు ఉద్యోగ భారతి అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఎంఎస్ఎంఈ బోర్డు మేంబర్ మొహంసుందరం సంస్థని ఎలా విస్తరించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత లఘ ఉద్యోగభారతి ఈసీ మెంబెర్ అనిల్, అనంత్.. నూతన అధ్యక్ష, కార్యదర్శులు వసంతమ్ వెంకటేశ్వర్లు, కందుల నరేంద్రనాథ్ దత్, ట్రేజరర్ అనూజ్ ఖండేల్వాల్, సంయుక్త కార్యదర్శి సంతోష్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ సుధాకర్శర్మ, కుసుమ వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి, సభ్యులు లఘు ఉద్యోగ భారతి తెలంగాణ ప్రభారీ శ్రీధర్రెడ్డి, తెలంగాణ సంఘటన కార్యదర్శి శివరాం, స్వవలంబి భారత్ అభియాన్ తెలంగాణ కో కన్వీనర్ బొల్లంపల్లి ఇంద్రసేనరెడ్డి, లఘు ఉద్యోగ భారతి సభ్యురాలు, పారిశ్రామిక వేత్త మాధవిలత పాల్గొన్నారు.