17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మైండ్‌తో కాదు.. మనసుతో చూడండి

15-10-2025 01:22 AM

బీవీ వర్క్స్ బ్యానర్ ద్వారా బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ పతాకంపై కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డాకర్టర్ విజేందర్‌రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్రమండలి’. ఈ సినిమాలో ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం హీరోహీరోయిన్లు. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేశ్ ముఖ్య పాత్రల్లో నటించారు.

అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మిత్ర మండలి’ పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీని మైండ్‌తో కాకుండా, మనసుతో చూడండి. అందరినీ నవ్విస్తుంది” అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. “మిత్ర మిండలి’ మీకు నచ్చకపోతే.. తర్వాత వచ్చే నా ఏ సినిమానూ చూడకండి” అని చెప్పారు.

బన్నీ వాస్ మాట్లాడుతూ.. “మన మూవీ బాగుండాలని పక్కన చిత్రాల్ని తక్కువ చేయడం, ట్రోలింగ్ చేయించడం, నెగెటివ్ ప్రచారం చేయించడం తప్పు. పోటీ అనేది ఎప్పుడూ ధర్మంగా ఉండాలి” అన్నారు. ‘అక్టోబర్ 16న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి హిట్ చేయండి’ అని నిహారిక ఎన్‌ఎం, డైరెక్టర్ విజయేందర్, నిర్మాతలు భాను ప్రతాప   విజేందర్ రెడ్డి తీగల చెప్పారు.