calender_icon.png 9 May, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో చేరిన మడవి రమాదేవి

09-05-2025 12:00:00 AM

ఆదిలాబాద్, మే 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో సోనాల మండ లం గన్‌పూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకురాలు, సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పోటీ చేసిన ఆదివాసీ బిడ్డ మడవి రమాదేవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గురువారం నేరడిగొండలో ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిం చారు.

ఈ మేరకు రమాదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ సాధికారత కోసం ఎంతో కృషి చేస్తుందని, మహాలక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న ఉచిత బస్సు, 500 కు సిలిండర్, వడ్డీ లేని రుణాలు, ఇలా  గొప్ప పథకాలు అందిస్తూ అభివృద్ధి చేస్తుం దని ఈ అభివృద్ధిని చూసి  కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సోనాల మండల  సీనియర్ నాయకులు గాజుల పోతన్న, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్, యాత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ బద్దం పోతారెడ్డి, సద్దాం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.