25-08-2025 12:23:16 AM
భక్తులతో కిక్కిరిసిన సూర్యక్షేత్రం
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి) ఆగస్టు 24 : మండలంలోని తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి మహాక్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి,అభిషేకాలు జరిపారు.అనంతరం మధ్యాహ్నం యజ్ఞశాలలో మహాసౌర హోమాన్ని వైభవంగా నిర్వహించారు.
అలాగే క్షేత్ర ఆవరణలో ఉన్న కార్యసిద్ధి వీర హనుమాన్,శ్రీరామకోటి స్తూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు.కాగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ జరిపారు.కార్యక్రమంలో కాకులారపు రజిత,ఘనపురం నరేష్,బీరవోలు ఇంద్రారెడ్డి,బాలమురళి,రత్నం లక్ష్మాజీ,అర్చకులు భీంపాండే,మోనుపాండే,శ్రీరామ్ పాండే,భక్తులు పాల్గొన్నారు.