23-11-2025 07:28:33 PM
నకిరేకల్ (విజయక్రాంతి): సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలలో భాగంగా స్థానిక సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మెయిన్ సెంటర్ లో మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ గర్రె శ్రీనివాసులు, సభ్యులు బ్రహ్మదేవర బ్రహ్మయ్య, రామ్మోహన్, చిలుకూరు లక్ష్మీ నరసయ్య, సుధాకర్, తొడుపునూరు గాంధీ, మిట్టపల్లి యాదగిరి, దేవరశెట్టి సత్యనారాయణ, పారేపల్లి రంగయ్య, గుడిపాటి నాగేశ్వరరావు, గర్రె సోమయ్య, గుడిపాటి శంభులింగం, పాలవరపు యాదగిరి, రేపాల దయాకర్, గర్రె రజిని, లీలావతి, శాంత, సంధ్య, నాగవల్లి, మంగతాయి, రజిత పాల్గొన్నారు.