13 May, 2026 | 2:09 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ గౌడ్ కీలక చర్చలు

07-10-2025 09:23 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాబితాపై మంగళవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్(Jubilee Hills by-election) ఉప ఎన్నికపై చర్చలు జరపనున్నారు. సీఎంతో చర్చల అనంతరం జాబితాను ఏఐసీసీకి పంపిస్తామని మహేష్ కుమార్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను జాతీయ ఎన్నికల సంఘం అధికారికంగా నిన్న విడుదల చేసింది. ఉప ఎన్నిక కోసం ముగ్గురు ఇన్‌చార్జ్ మంత్రులు సమర్పించిన నివేదిక ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తారని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ టికెట్‌ను బీసీ అభ్యర్థికి కేటాయించే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు సూచించారు, అయితే దీనిపై అధికారిక ప్రకటన రాబోయే రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉందన్నారు.

 ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విలేకరులతో అనధికారికంగా మాట్లాడిన ఆయన, టికెట్ కోసం ముగ్గురు బీసీ అభ్యర్థులు బలమైన పోటీలో ఉన్నారని తెలిపారు.మరోవైపు, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ టికెట్ రేసులో లేరని, గవర్నర్ కోటా కింద శాసన మండలికి నామినేట్ అయ్యే అవకాశం ఉందని టీపీసీసీ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టికెట్ కోసం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా జూబ్లీహిల్స్ టికెట్ పై కన్నేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకముందే ప్రధాన కూడళ్లలో బ్యానర్లు, ఫ్లెక్సీలు దర్శనిమిచ్చాయి. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ షేక్ పేటలో ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు, నవీన్ యాదవ్ విద్యార్థులకు స్టేషనరీ కిట్స్ అందజేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. నేటి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం అభ్యర్థి ఫైనల్ కానున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి వస్తుందో అన్న ఆసక్తి అందరి మదిలో మెదులుతోంది.