18-11-2025 07:28:37 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న తొలిమెట్టు కార్యక్రమాలను విజయవంతం చేయాలని విద్యాశాఖ ఆర్జేడి సత్యనారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం వివిధ పాఠశాలలను సందర్శించి డీఈవో కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులు తొలిమెట్టు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అధికారులు ఉన్నారు.