6 May, 2026 | 9:01 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

17-07-2025 10:58 PM

మేడిపల్లి: ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  జనగాం జిల్లా, చేడూర్ గ్రామానికి చెందిన ఇనుముల మల్లయ్య ఫిర్యాదు మేరకు తన కుమారుడు ఇనుముల శ్రీనివాస్ (40), అతని భార్య విక్టోరియా ఇద్దరు బతుకు దెరువు కోసం ఐదు నెలల క్రితం బోడుప్పల్ లోని ఆర్ ఎన్ ఎస్ కాలనీ కి వచ్చి అద్దెకు ఉంటున్నారు. గత రెండు, మూడు రోజుల నుంచి వారు కనబడకపోవడంతో ఇంటి ఓనర్ రాజేష్ తండ్రి మల్లయ్యకు ఫోన్ చేశాడు. వెంటనే తాను బోడుప్పల్ కు వచ్చి చూసేసరికి తన కొడుకు ఇంట్లో వెంటిలేటర్ కు చున్నీతో ఉరి వేసుకుని చనిపోయి కనిపించాడు. తండ్రి మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.