calender_icon.png 8 September, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంటలో తాబేళ్ల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

08-09-2025 02:10:52 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కురవి మండలంలోని తిరుమలాపురం నల్లెల్ల శివారులోని గణేష్ కుంటలో తాబేళ్ల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. బాజా వెంకన్న, భూతం వెంకన్న కలిసి తాబేళ్ల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు భూతం వెంకన్న కుంటలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని అతడి వెంట వెళ్లిన భాజా వెంకన్న సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది కుంటలో దిగి భూతం వెంకన్న ఆచూకీ కోసం గాలిస్తున్నారు.