17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మనస్థాపంతో ఉరేసుకుని వ్యక్తి మృతి

22-10-2025 07:40 PM

కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్వాడి దేవదానం(45) అనే వ్యక్తి తన వ్యవసాయ పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. కుక్కునూరు పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు దేవదానం ఎస్సీ మాదిగ వర్గానికి చెందినవాడు. వృత్తి రీత్యా డీసీఎం డ్రైవర్. కుటుంబ పోషణ కోసం సరైన పని చేయడం లేదని భార్య మార్వాడి మమత మందలించడంతో మనస్తాపానికి గురై తన పొలానికి వెళ్లి ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై కుకునూర్ పల్లి పోలీసులు క్రైం నంబర్ 229/2025, సెక్షన్ 194 బిఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.