14 April, 2026 | 5:17 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

చికిత్స పొందుతూ మహిళ మృతి

22-10-2025 09:48 PM

కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ పురపాలక పరిధిలోని సిలార్ పల్లకి చెందిన స్వాతి(35) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. ఈ నెల 18న తన భర్త సైదులుతో కలిసి వెల్దండ నుండి స్వగ్రామానికి వెళ్తుండగా పట్టణంలోని జింజర్ హోటల్ ముందు వాహనం అదువుతప్పి పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.