16-10-2025 09:54:27 AM
హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో(Vikarabad) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్కు చెందిన అంతగిరి శ్రీను (25) అనే వ్యక్తి వికారాబాద్ వంతెనపై బైక్పై వెళ్తుండగా, వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంలో కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.