14-08-2025 07:24:09 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నెల పోలీస్ స్టేషన్ లో బుధవారం గంజాయి కేసులో అరెస్టు చేసిన మంచిర్యాల గజ్జరాగడి ప్రాంతానికి చెందిన పాల్తేపు ప్రణయ్(23) అనే వ్యక్తిని గురువారం రిమాండ్ చేసి జైలుకు పంపించినట్లు ఎస్సై ప్రసాద్(SI Prasad) తెలిపారు. గంజాయి సేవించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎక్కడైనా గంజాయి అమ్మిన, సేవించిన తమకు సమాచారం అందించాలని ఎస్సై ప్రసాద్ కోరారు.