15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు ప్రారంభం

12-01-2026 12:32 AM

చిట్యాల, జనవరి 11(విజయ క్రాంతి): చిట్యాల మండలం  ఉరుమడ్ల గ్రామంలో మండల స్థాయి కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలను తెలంగాణ రాష్ట్ర డైయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ కుమార్ రెడ్డి  సహకారంతో కీ.శే.సోమనబోయున నాగేష్ జ్ఞాపకార్థంగా ఆటల పోటీలను నిర్వహించారు. ఆదివారం ఈ ఆటల పోటీలను  గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్ తో కలిసి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ సాగర్ల భాను యూత్ సభ్యులకు ఉచితంగా వాలీబాల్ మరియు నెట్ అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కీ.శే. సోమనబోయున నాగేష్ జ్ఞాపకార్థం గా  గ్రామంలోని  క్రీడలు నిర్వహిస్తున్నామని  క్రీడలు శారీరక మానసిక ఒత్తిడికి లోను కాకుండా  ప్రశాంతతను కల్పిస్తాయని అన్నారు. కావున యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడల వల్ల గ్రామంలోని ఐక్యత భావం పెరుగుతుందని ప్రతి ఒక్కరు ఆటలు ఆడి తమ యొక్క ప్రతిభను నిరూపించుకోవాలని క్రీడాకారులకు, యువతకు  తెలియజేశారు.

  వార్డు సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురo రాము, మేడబోయున శ్రీను స్వాతి, మర్రి పూలమ్మ, జనపాల శ్రీను, ఎలిమినేటి హరీ ప్రసాద్, వనమా వెంకటేశ్వర్లు, యాదవ సంఘం అధ్యక్షులు బొడ్డు శ్రీను, మర్రి రమేష్, గుత్తా రవీందర్ రెడ్డి, జనపాల గణేష్, సోమనబోయున వెంకటేష్, బెలిజ పరమేష్, వ్యాయామ ఉపాధ్యాయుడు కొండా పరమేష్,సాగర్ల లింగస్వామి పాల్గొన్నారు.