14 April, 2026 | 5:14 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

మణికొండకు రూ.121 కోట్ల నిధులు

20-11-2025 12:00 AM

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీధర్ బాబు

మణికొండ, నవంబర్ 19, విజయక్రాంతి :  మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.121 కోట్ల భారీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మున్సిపల్ సాధారణ నిధులు రూ.18.40 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని నింపే లక్ష్యంతో రూ.3.05 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రికెట్ స్టేడియంను మంత్రి ప్రా రంభించారు. అలాగే వరద ముంపు సమస్య పరిష్కారానికి పందెం వాగుపై స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.