31-07-2025 11:46:02 PM
తరిగొప్పుల,(విజయక్రాంతి): జనగాం జిల్లా తరిగొప్పుల మండలం అక్క రాజు పల్లి గ్రామం క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సంతోష్ పాండే అనే వ్యక్తి సూర్య నాగ గౌరీ శంకర్ రోడ్ గ్రామం గంజం జిల్లా శివరాం అనే వ్యక్తి డాక్వ పున్నత్ గ్రామం ఒరిస్సాకు చెందిన వ్యక్తుల నుండి తరిగొప్పుల ఎస్సై శ్రీదేవి రెండు కిలోల 5 బ్యాగులు మొత్తం 10 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది సుమారు ఐదు లక్షల విలువ ఉంటుందని తెలపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సీఐ అబ్బయ్య సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఒకరిని రిమాండ్ కు తరలిస్తున్నాము అని ఒకరు పారిపోయారని వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.