13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి

07-01-2026 12:11 AM

మాగనూరు, జనవరి 6: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెన్ ప్రకారము నాణ్యమైన భోజనాన్ని  అందివాలని నేరడ గమ్ము సర్పంచ్ దాసరి వెంకటమ్మ వంట ఏజెన్సీలను ప్రధానోపాధ్యాయులను కోరారు . మంగళవారం మాగనూరు మండల పరిధిలోని నేరడ గమ్ము గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలను, సర్పంచ్ దాసరి వెంకటమ్మ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. 

విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని క్రీడల వల్ల మానసిక ఉల్లాసం , శరీర దృఢత్వం, మేధాశక్తి ,కలుగుతుందన్నారు. క్రీడల్లో రాణించి జిల్లా ,రాష్ట్రస్థాయికి విద్యార్థులు ఎంపిక కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి రాజా, వార్డ్ మెంబర్లు డి ప్రకాష్ ,,వెంకటేష్, ప్రధాన ఉపాధ్యాయులు రాజేష్ కుమార్ ,ఉపాధ్యాయులు రామ్మోహన్ ,టీచర్లు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.