1 April, 2026 | 1:36 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి

25-10-2025 12:16 AM

కరీంనగర్ అడిషనల్ డీఎంహెచ్వో రాజగోపాల్ 

చిగురుమామిడి, అక్టోబర్ 24(విజయక్రాంతి): వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని అడిషనల్ డీఎంహెచ్వో రాజగోపాల్ ఆదేశించారు. చిగురుమామిడి మం డల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. దవాఖానలో ఓపీ రిజిస్టర్, రికార్డులు, ల్యాబ్ రూమ్, ఫార్మసీ రూం, సిబ్బంది పనితీరును మండల వైద్యాధికారి రాజేష్ ను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పరీక్షల కోసం వచ్చి న వారితో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని, ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. వీరి వెంట మండల వైద్యాధికారి సన్నిల్ల రాజేష్, వైద్య సిబ్బందిఉన్నారు.