15 April, 2026 | 6:19 AM

ఈనెల 18న సమావేశాలు నిర్వహించుకోవాలి

16-10-2025 05:24 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 18న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పోషకులు ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో పోషకులతో సమావేశం నిర్వహించి పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల స్థితిగతులను పాఠశాల అభివృద్ధికి పోషకుల సహకారం తదితర అంశాలపై చర్చించాలని సూచించారు. పేటీఎం సమావేశాల్లో చర్చించిన అంశాలను కార్యచరణ ద్వారా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.