16 April, 2026 | 8:42 AM

మెగా రక్తదాన శిబిరం

30-10-2025 12:00 AM

 రక్త దానం చేసిన సీపీ గౌష్ ఆలం

కరీంనగర్‌క్రైం, అక్టోబర్29(విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని, బుధవారం కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోగ ల అస్త్ర కన్వెన్షన్ హాలు నందు రక్తదాన శి బిరం కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ పోలీసు కమీషనర్ సీపీ గౌష్ ఆలంతోబుపా టు నగరంలోని పలువురు ఉత్సాహంగా పా ల్గొన్నారు.సి పి మాట్లాడుతూరక్తదానం వల న అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడుతుందన్నారు. తలసీమియా బాధితులకు ఎంతో అవసరమన్నారు.

సామజిక బా ధ్యతతో అందరూ రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా 160 యూ నిట్లను సేకరించామని , సేకరించిన రక్తాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్ కు అందజేశామని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీం రావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి లతో పా టు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి లతో పాటు వివిధ పలు సంస్థల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.