మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రి ఘటనపై దర్యాప్తుకు ఆదేశం
హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Raja Narasimha) మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రి ఘటనపై(Mahabubabad General Hospital incident) దర్యాప్తునకు ఆదేశించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీ నియమించారు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బతికి ఉన్న వ్యక్తిని నిన్న మార్చురీకి తరలించారు. ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 45 ఏళ్ల వ్యక్తిని చనిపోయినట్లు భావించి మార్చురీకి తరలించారు.
తరువాత అతను సజీవంగా ఉన్నట్లు తెలింది. గురువారం ఆరోగ్య అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ వ్యక్తి తాను కిడ్నీ సమస్య చికిత్స కోసం వచ్చానని చెప్పాడు. "నేను ఐదు రోజుల క్రితం మహబూబాబాద్ వచ్చాను. నాకు కిడ్నీ సమస్యలు ఉన్నాయి. ఆసుపత్రిలో చేరడానికి వచ్చాను. ఆధార్ కార్డు లేకపోవడం, ఒంటరిగా ఉండటంతో డాక్టర్ నాకు చికిత్స నిరాకరించారు. నా గ్రామానికి తిరిగి వెళ్ళడానికి నా దగ్గర డబ్బు లేదు. నేను రెండు రోజులు ఆసుపత్రి ఆవరణలోనే పడుకున్నాను" అని ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్న ఆ వ్యక్తి పేర్కొన్నాడు.






