17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

31-10-2025 09:54 PM

భద్రాచలం,(విజయక్రాంతి): పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా భద్రాచలం పట్టణంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం భద్రాచలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేవు.

పోలీసుల సేవలను స్మరించుకుంటూ రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివ నాయక్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వీరితో పాటు సిఆర్పిఎఫ్ బెటాలియన్ జవాన్లు, పోలీసు సిబ్బంది, ఆటో యూనియన్ సభ్యులు, వికలాంగులు, బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఉత్సాహంగా రక్తదానంలో పాల్గొన్నారు.