18-08-2025 12:10:09 AM
సంగారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి) : సింగూర్ ప్రాజెక్టులో వరద ప్రవాహం, డ్యాం పరిస్థితిని రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదివారం పరిశీలించారు. డ్యామ్ సురక్షితతపై ప్రత్యామ్నాయ మార్గాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇరిగేషన్ ఎస్ఈ పొచ్చా మల్లు, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఎగువ ప్రాంతం నుండి వస్తున్న 31,968 క్యూసెక్కుల వరద దృష్ట్యా, సింగూర్ ప్రాజెక్ట్ నుండి దిగువకు 43,634 క్యూసెక్కుల వరదను ఐదు గేట్ల ద్వారా విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. డ్యామ్ సేఫ్టీ కమిటీ సూచనల మేరకు సింగూర్ జలాశయం భద్రతను కాపాడే విధంగా 520.5 మీటర్ల వరకు నీటి నిల్వను యావరేజ్గా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.