21 April, 2026 | 1:41 PM

ధాన్యం నిల్వల విషయంలో రూ. 11 వేల కోట్ల స్కామ్

21-04-2026 11:45 AM

యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పెంచాలి :  మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పర్యటించారు. రబీ ధాన్యం సేకరణపై అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పెంచాలని కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు పెంచాలన్నారు. రాత్రి, పగలు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపాలన్నారు. ధాన్యం ఎక్కువ వచ్చే గ్రామాలకు ఎక్కువ లారీలు పంపాలని సూచించారు. రోడ్లపై ధాన్యం పోయకుండా స్కూల్లు, ఫంక్షన్ హాళ్ల వద్ద కేంద్రం పెట్టాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ ఉండేలా చూడాలని చెప్పారు. నల్గొండ పరిధిలో 2.30 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి అంచనా వేశారు.

ధాన్యం నిల్వల విషయంలో రూ. 11 వేల కోట్ల స్కామ్

ధాన్యం నిల్వల విషయంలో రూ. 11 వేల కోట్ల స్కామ్ జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక కొంతమేర ధాన్యం రికవరీ చేయించామని తెలిపారు. నల్గొండ జిల్లాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. డైరెక్టర్, ఎండీని అరెస్టు చేశారు. ఇటీవల బెయిల్ వచ్చిందని మంత్రి వివరించారు. నల్గొండ జిల్లాలోనే రూ. 4 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. బకాయిలు చెల్లించి రెగ్యులర్ గా నడుపుకోవాలని చెప్పామని వెల్లడించారు. చర్చల తర్వాత బకాయిలు చెల్లించే విధింగా ఒప్పకున్నారని తెలిపారు. నల్గొండ జిల్లాలో పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రచించామని మంత్రి స్పష్టం చేశారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా కృష్ణా జలాలు తెప్పిస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.