10-12-2024 04:26:43 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమావేశం అయ్యారు. వివిధ పథకాల పురోగతిపై అధికారులతో మంత్రి తుమ్మల విస్తృత చర్చలు జరిపి, ప్రాథమిక సహకార సంఘాల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ అమలులో వేగం పెంచాలని ఈ సందర్భంగా తుమ్మల అధికారులను ఆదేశించారు. మార్చిలోపు లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.