3 April, 2026 | 4:04 PM

వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో మంత్రి తుమ్మల సమావేశం

10-12-2024 04:26 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమావేశం అయ్యారు. వివిధ పథకాల పురోగతిపై అధికారులతో మంత్రి తుమ్మల విస్తృత చర్చలు జరిపి, ప్రాథమిక సహకార సంఘాల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.  వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ అమలులో వేగం పెంచాలని ఈ సందర్భంగా తుమ్మల అధికారులను ఆదేశించారు. మార్చిలోపు లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.