16 April, 2026 | 10:23 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నిజాయితీని చాటుకున్న మియాపూర్ డిపో బస్‌కండక్టర్

17-05-2025 12:13 AM

- బస్సులో మర్చిపోయిన విలువైన బ్యాగు అందజేత

శేరిలింగంపల్లి, మే 16: మియాపూర్ డిపోలో పనిచేస్తున్న బస్ కండక్టర్ తన నిజాయితీ చాటుకున్నాడు. గురువారం మియా పూర్-2 డిపోకు చెందిన పుష్పక్ ఎయిర్ పోర్ట్ బస్సులో తలారి భావన అనే ప్రయాణికురా లు బ్యాగును మర్చిపోయి బస్సు దిగిపోయింది. ఇది గమనించిన బస్ కండక్టర్  షేక్ ముబీన్ ఆ బ్యాగును డిపోలో భద్రంగా అ ప్పగించాడు.

కాగా ఆ బ్యాగులో ఎనిమిది లక్షల విలువైన బంగారు ఆభరణాలు , వస్తువులు ఉన్నాయి. అయితే సదరు ప్రయాణికు రాలిని గుర్తించి శుక్రవారం ఆమెకు బ్యాగు ను అందజేశారు మియాపూర్ డిపో 2 అధికారులు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ షేక్‌ముబీన్ ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ అపర్ణ కళ్యాణి, డిపో మేనేజర్ వెంకటేశం,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.