15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో ఎంజేపీ విద్యార్థుల హవా

15-10-2025 12:52 AM
  1. 11 మెడల్స్ సాధించిన విద్యార్థులు 

రాష్ట్ర స్థాయికి పోటీలకు ఐదుగురు ఎంపిక 

దౌల్తాబాద్,అక్టోబర్ 14: మండల పరిధిలోని లోని మహాత్మ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్,సంగారెడ్డి పట్టణాల్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్ క్రీడల్లో అండర్19,అండర్14 విభాగాలలో గురుకుల కళాశాల,పాఠశాల విద్యార్థులు మొత్తం 11 మెడల్స్ను కైవసం చేసుకున్నారు.

అండర్14 విభాగంలో విష్ణు వర్ధన్,దేవీదాస్,భానుప్రసాద్, గణేష్,గిరీష్ రాష్ట్ర స్థాయి క్రీడలకు అర్హత సాధించగా అండర్19 విభాగంలో భరత్, జశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయికి ఎదగడం విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావానికి నిదర్శనం అని అభిప్రాయపడ్డారు.వ్యాయామ ఉపాధ్యాయులు సాయి కృష్ణ,బస్వరాజ్,డాంబు విద్యార్థులను అభినందించారు.