08-08-2025 12:22:39 AM
శేరిలింగంపల్లి, ఆగస్టు 7: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి , డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి శేరిలింగంపల్లి జోనల్ కార్యలయంలో జోనల్ కమిషనర్ హేమంత్ బొర్ఖడే ,డీసీ శ్రీమతి శశిరేఖ , కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఏ ఏంఓహె శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి పారిశుధ్య సిబ్బందికి ఎమ్మెల్యే గాంధీ పీపీఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది తల్లిదండ్రులతో సమానం అని , కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు మరువలేనివన్నారు.