19-11-2025 01:01:31 AM
ఆమనగల్లు, నవంబర్ 18: రాచకొండ సిపి సుధీర్ బాబును కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అభినందించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో సిపిని ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు.ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోరీ జరిగింది. కళాశాలలో విద్యార్థులు చెల్లించిన రూ. 1కోటి రూపాయలు దొంగల ముఠా చోరి కి పాల్పడింది. దీంతో పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని కళాశాలలో దొంగతనానికి పాల్పడిన దొంగల ముఠాను పట్టుకున్నారు.