18-08-2025 01:34:10 AM
ఖానాపూర్, ఆగస్టు 17: ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం దస్తురాబాద్ పెంబి ఖానాపూ ర్ తదిర మండలాలు భారీ వర్షాలు కురిసి వాగులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల వర్ధముంపు గురైన ప్రాంతాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం పరిశీలించారు.
పంటలతో పాటు కాలనీలను సందర్శించి సాయక చర్యలను ముమ్మరం చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ప్రాజెక్టు సందర్శించి అక్కడ వరద పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.