3 July, 2026 | 11:37 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

బొడ్రాయి, బోనాల వేడుకలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

26-05-2025 01:49 AM

మహబూబాబాద్, మే 25 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి, బోనాల వేడుకల్లో తొర్రూరు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి బోనాలు సమర్పించి బొడ్రాయి వద్ద నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు.

గ్రామస్తులంతా సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బొడ్రాయి, బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో సందడిగా మారింది.