11-12-2025 01:52:45 AM
వరంగల్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి బుధవారం దర్శించుకున్నారు. వల్లభ గణపతిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు సిద్దేశ్వర శర్మ అమ్మవారి శేష వస్త్రాన్ని, గాజులు కుంకుమ, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త తొనుపునూరి వీరన్న, సిబ్బంది కృష్ణ, సంపత్ పాల్గొన్నారు.