4 April, 2026 | 3:54 PM

Breaking News

ప్రముఖ రచయిత్రి స్వర్ణ కిలారికి గూడూరి సీతారాం పురస్కారం   •   సురక్షిత సమాజం కోసం సీసీ కెమెరాల ఏర్పాటు   •   సకాలంలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలి   •   మేడ్చల్ పెద్ద చెరువు కట్ట పైనుంచి కిందకు రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష   •   ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •  

ఆపరేషన్ సిందూర్‌పై మోదీ స్పష్టత ఇచ్చారు

28-07-2025 01:11 AM

- ట్రంప్ వ్యాఖ్యలకు విశ్వసనీయత లేదు 

- కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం సరికాదు 

- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ 

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఆపరేషన్ సింధూర్‌పై మోదీ ఇప్పటికే పూర్తి స్పష్టత ఇచ్చారని  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ అన్నారు. ఏమాత్రం విశ్వ సనీయత లేని ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించడం విచారకరమన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ లేవనెత్తిన చర్చను స్వాగతిస్తున్నామని ఆయ న అన్నారు.

దేశ పరిరక్షణ అందరి బాధ్యత అని, స్పష్టత కోరుకోవడంలో తప్పు లేనప్పటికీ పార్లమెంట్‌కు అంతరాయం లేకుండా జరిగేందుకు సహకరించాలని సూచించారు. ఆదివారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న చొరవను ప్రతిపక్ష నేతగా వాజ్‌పాయ్ ప్రశంసించిన తీరును ఇప్పటి కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

మోదీ నేతృత్వంలో మన దేశం మూడుసార్లు పాకిస్తాన్‌పై విజయవంతంగా దాడులు నిర్వహించి, మన వైఖరిని స్పష్టం చేసినప్పటికి కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేయ డం దుర్మార్గమన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన చర్చలో కాంగ్రెస్ పార్టీ నిజాలను స్వీకరిస్తుందా లేదా దేశ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందా అనేది ప్రజలు గమనిస్తారని ఆయన పేర్కొన్నారు.