28 June, 2026 | 2:12 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

సేజ్ పాఠశాలలో ‘నా మట్టి -- నా దేశం’ ఈ కార్నివాల్

23-11-2025 01:15 AM

ముఖ్యఅతిథిగా శ్రీనిధి యూనివర్సిటీ ప్రోఛాన్స్‌లర్ నరసింహారెడ్డి

మేడిపల్లి, నవంబర్ 22 (విజయక్రాంతి) : మేడిపల్లి లో శనివారం నాడు  సెజ్ పాఠశాల ప్రాంగణంలో ఈ కార్నివాల్ కార్యక్ర మం అత్యంత వైభవంగా జరిగింది.నామట్టి - నాదేశం అనే నినాదముతో  ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  శ్రీ నిధి యూని వర్శిటి ప్రో ఛాన్స్లర్ నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ ఎస్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ  అభినందిం చారు.

సేజ్ పాఠశాల విద్యార్థులందరూ సమిష్టిగా శ్రమించి సమగ్ర భారతావనిని ఈ కార్నివాల్ లో ఆవిష్కృతం చేశారు.భాషలు, సంస్కృతులు, వైద్య, రవాణ, కృత్రిమ మేధస్సు లాంటి అనేకమైన  ప్రాచీనం నుండి నేటి ఆధునికత వరకే కాకుండా భవిషత్ లో ఎలాంటి సాంకేతికత రాబోతుందో తము నమూనాల ద్వారా విదార్థులు ఈ కార్నివాల్ లోప్రదర్శించారు.

ఈ నమూనాలు విద్యార్థుల తల్లి దండ్రులను విశేషంగా  ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమము లో  ప్రిన్సిపల్ చైత్రరెడ్డి, అకాడమీ డైరెక్టర్ సీతామహాలక్ష్మి, డైరెక్టర్  రోహిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమమును విజయవంతం చేసినందుకు విద్యార్థినీ, విద్యార్థుల కు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ నామట్టి - నాదేశం అనే నినాదాన్ని ప్రతిజ్ఞ చేశారు.