28 June, 2026 | 3:09 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

మొయినాబాద్‌లో కోడిపందాలు

23-11-2025 12:03 AM

గుట్టురట్టు చేసిన పోలీసులు

18 కోడి కత్తులు, 22 కోళ్లు స్వాధీనం 

4 కార్లు, 13 సెల్‌ఫోన్లు సీజ్ 

మొయినాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందేల నిర్వహణ గుట్టురట్టయింది. కోడి పందేలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు అరె స్టు చేశారు. మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు దాట్ల కృష్ణంరాజుతోపాటు మొత్తం 14 మంది కోడిపందాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు శనివారం దాడులు చేసి రూ.60,950 నగదు తోపాటు 4 కార్లు, 13 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. మొత్తం 22 కోళ్లు, 18 కోడి కత్తులను స్వాధీ నం చేసుకున్నారు.