16 April, 2026 | 12:07 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

సౌతాఫ్రికాకు నమీబియా బిగ్ షాక్

12-10-2025 01:04 AM

విండ్హోక్, అక్టోబర్ 11: ప్రపంచ క్రికెట్‌లో సంచలనం నమోదైంది. ఇటీవల నేపాల్, విండీస్‌పై టీ20 సిరీస్ గెలిస్తే.. తాజాగా దక్షిణాఫ్రికాకు పసికూన నమీబియా షాకిచ్చిం ది. సొంతగడ్డపై సఫారీలతో జరిగిన ఏకైక టీ ట్వంటీలో నమీబియా 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఒక అసోసియేట్ దేశం చేతిలో ఓడిపోవడం సౌతాఫ్రి కాకు ఇది రెండోసారి.

మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 134 పరుగులకే పరిమితమైంది. డికాక్,హెండ్రిక్స్ నిరాశపరిస్తే.. స్మిత్(31) ఒక్కడే రాణించాడు. ఛేజింగ్‌లో నమీబియా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది.చివరి ఓవర్లో విజయం కోసం 11 రన్స్ చేయాల్సి ఉండగా...జేన్ గ్రీన్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం ఉన్న జట్టుపై నమీబియా గెలవడం ఇది నాలుగోసారి.