13 April, 2026 | 4:29 PM

Breaking News

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు   •   మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •  

ఏటూరు నాగారం డిగ్రీ కళాశాలలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

31-10-2025 07:47 PM

ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమానికి చరిత్ర విభాగ అధిపతి సిహెచ్. వెంకటయ్య అధ్యక్షత వహించి వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మాలధారణ చేసి అయిన మాట్లాడుతూ... జాతీయ సమైక్యతకు వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని తెలియజేస్తూ భారత స్వాతంత్య్ర అనంతరం 560కి పైగా ఉన్న సంస్తానలను ఒప్పించి మెప్పించి (సామ,దాన, భేద, దండోపాయలు) ప్రయోగించి సమైక్య భారత దేశాన్ని సాధించారని పేర్కొన్నారు.అదే విధంగా హైదరాబాద్ సంస్థానాన్ని(రాజ్యాన్ని) భారత యూనియన్ లొ ఆపరేషన్ పోలో(సైనిక చర్య)జరిపి 1948 సెప్టెంబర్ 17లో సమైక్య భారత దేశంలో విలీనం చేయటంలొ ముఖ్యపాత్ర వహించారని కొనియాడారు.