17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ప్రకృతి వనం.. మందుబాబులకు నిలయం!

22-12-2025 12:56 AM

రేవల్లి, డిసెంబర్ 21: మండలంలోని పలు గ్రామాల్లో పచ్చదనం పెంచాలని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’పల్లె ప్రకృతి వనం’ లక్ష్యం దారి తప్పుతోంది. నాగపూర్ గ్రామంలోని ప్రకృతి వనం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ వనం ప్రస్తుతం సరైన పర్యవేక్షణ లేక వెలవెలబోతోంది.

గేట్లు తెరిచే ఉండటంతో ఎవరైనా లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. ప్రకృతిని ఆస్వాదించాల్సిన చోట మందుబాబులు తిష్ట వేస్తున్నారు. రెండో చిత్రంలో కనిపిస్తున్నట్లుగా వనంలోని మొక్కల మధ్య ఖాళీ మద్యం సీసాలు విచ్చలవిడిగా పడి ఉన్నాయి. ఇది వనం యొక్క పవిత్రతను, పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. పల్లె ప్రకృతి వనాల నిర్వహణను స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.