24-07-2024 12:12:43 PM
టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం
ఖాట్మండు: నేపాల్ మరో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శౌర్య ఎయిర్లైన్స్ విమానం బుధవారం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. పోఖారాకు వెళ్లే విమానంలో సిబ్బందితో సహా 19 మంది మృతి చెందినట్లు టీఐఏ అధికార ప్రతినిధి ప్రేమ్నాథ్ ఠాకూర్ ఉటంకిస్తూ నేపాలీ న్యూస్ వెబ్సైట్ ఖాట్మండు పోస్ట్ పేర్కొంది. దక్షిణాసియా కాలమానం ప్రకారం, టేకాఫ్ సమయంలో విమానం రన్వేపై నుంచి జారిపడి కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసినట్లు అధికారులు వెల్లడించారు. విమానం కుప్పకూలిన తర్వాత దగ్ధమైంది. శకలాల నుంచి ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్లు సహాయ సిబ్బంది వెల్లడించారు.