24-01-2026 12:00:00 AM
బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్
సికింద్రాబాద్ జనవరి 23 (విజయ క్రాంతి): భారత స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129 వ జయంతి పురష్కరించుకొని న్యూ బోయన్ పల్లి నేతాజీ నగర్ లోని నేతాజీ విగ్రహానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు ప్రతాప్ పూలమాలలు వేసి నివాళులు అర్పించి దేశం కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసారు.
బోయిన్పల్లిలలో..
తరతరాలకు స్ఫూర్తి, భారత గౌరవానికి ప్రతీక, స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 129 వ జయంతి సందర్భంగా న్యూ బోయన్ పల్లి నేతాజీ నగర్ లోని నేతాజీ విగ్రహానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి పూలమాలవేసివారి సేవలను స్మరించు కుంటూ జక్కుల మహేశ్వర్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.