12 March, 2026 | 9:45 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

నూతన ఫిజియోథెరపీ కోర్సు ప్రారంభం

14-11-2025 12:50 AM

ప్రారంభించిన ఎస్‌ఎంబీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అరుణ్‌బాబు

ఖైరతాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : కాళోజి నారాయణ యూనివర్సిటీ కి అనుబంధగా ఉన్న ఎస్‌ఎంబీ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపి లో నూతన ఫిజియోథెరపి కోర్సు ప్రారంభం అవుతున్నట్లు కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అరుణ్ బాబు, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ లు తెలిపారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్ బాబు మాట్లా డుతూ ఇంటర్ మీడియట్‌లో బైపీసీ, ఒకేషనల్ విద్య ను అభ్యసిస్తున్న వారికోసం నాలుగున్నర సంవత్సరాల ఫిజియోథెరపి కోర్సును ఎస్ ఎం బి లో నూతనంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.సీట్ల కోసం హైదరాబాద్ లోని తమ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

ఒక బ్యాచ్‌లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉంటారని అందులో ముప్పు మంది కౌన్సిలింగ్ నుండి మిగతా ఇరవై మంది మేనేజ్ మెంట్ కోటాలో సీట్లు భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.ఫిజియోథెరపికి మన దేశంలో, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.