24-05-2025 02:56:33 PM
పాఠశాల చైర్మన్ గంట్ల అనంతరెడ్డి
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): పాలీసెట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా కేంద్రంలోని యాటకన్నారెడ్డి కాలనీలోని న్యూస్ పాఠశాల విద్యార్థిని జి. వాగ్దేవి రాష్ట్రస్థాయిలో 51 వ ర్యాంక్ సాధించి ఉత్తమ ప్రతిభ కనపర్చిందని పాఠశాల చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి విద్యార్థి పై తీసుకునే శ్రద్ధకు నిదర్శనం అని ఉపాధ్యాయుల నిరంతర కృషి, మరియు ప్రత్యేక ప్రణాళిక, తల్లిదండ్రుల సహకారంతో సాధ్యమైంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, హెడ్ మిస్ట్రెస్ గంట్ల పద్మ, ప్రిన్సిపల్ అలుగుబెల్లి తిరుమలరెడ్డి, అలుగుబెల్లి స్పందన, పర్వత రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.