1 July, 2026 | 8:58 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

దైవ అనుగ్రహం అందరిపై ఉండాలి

24-05-2025 06:18 PM

బుద్ధారం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..

హన్వాడ: మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో బొడ్రాయి పండుగ, నాగ నాభిశిల, గ్రామ దేవతల పునః ప్రతిష్టపనను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

బొడ్రాయి ప్రతిష్ఠాపనలో వివిధ ప్రాంతాల నుంచి ఆడపడుచులు వచ్చి సంబరంగా వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలు పండేలా చూడాలని గ్రామ దేవతలను మొక్కుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ నరేందర్, సీనియర్ నాయకులు కొండా లక్ష్మయ్య, శ్రీనివాసులు, బసి రెడ్డి, జంబూలయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.