15 March, 2026 | 7:43 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో నిఖత్ జరీన్

20-11-2025 12:18 AM

గ్రేటర్ నోయిడా, నవంబర్ 19:ప్రపంచ బాక్సింగ్‌లో భారత హవా మరో స్థాయికి చేరింది. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్‌లో ఏకంగా 15 మంది భారత బాక్సర్లు ఫైనల్స్‌కు చేరుకున్నారు. వివిధ విభాగాల్లో 8 మంది మహి ళలు, ఏడుగురు పురుషుల ఫైనల్లో అడుగుపెట్టారు. తెలంగాణ బాక్సర్ , రెండుసార్లు వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

సెమీస్‌లో నిఖత్ 5 స్కోర్‌తో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ గుల్సెవర్‌పై విజడయం సాధించిం ది. అన్ని రౌండ్లలోనూ పూర్తిగా ఆధిపత్యం కనబరుస్తూ నిఖత్ పంచ్‌ల వర్షం కురిపించింది. ప్రీతి పవార్, అరుంధతి , మీనాక్షి, నుపుర్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నారు.

16 దేశాల నుంచి 130 మంది ఎలైట్ బాక్సర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ మన బాక్సర్లు అదరగొట్టారు. ఒలింపిక్ మెడలిస్టులు, వరల్డ్ చాంపియన్లకు సైతం షాకిచ్చి ఫైనల్స్‌కు దూసుకొచ్చారు.