2 July, 2026 | 12:12 PM

Breaking News

స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •  

పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దు

26-09-2025 12:00 AM

స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్, సెప్టెంబర్ 25: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టు ఊరటనిచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం విదితమే. ఈ నివేదికలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పేరును కూడా కమిషన్ పేర్కొంది.

దీనిపై స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి దీనిని విచారిస్తామని పేర్కొంది.