15-10-2025 07:13:43 PM
పాట్నా: రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జనతాదళ్ (యునైటెడ్) 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను బుధవారం విడుదల చేసింది. జేడీ(యూ) ప్రకటించిన 57 మంది అభ్యర్థుల జాబితాలో ముస్లిం అభ్యర్థులకు సీట్లను కేటాయించేదు. తరువాత జాబితాలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టవచ్చని పార్టీ వర్గాల తెలియజేస్తున్నాయి. అయితే, ముస్లిం పేర్లు లేకపోవడం ఇప్పటికే రాజకీయ చర్చకు, ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలకు దారితీసింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో, జేడీ(యు) 115 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. కానీ ఎవరూ గెలవలేదు.
అదేవిధంగా 2024 లోక్సభ ఎన్నికల్లో జేడీ(యు) కిషన్గంజ్ నుండి ముజాహిద్ ఆలం నిలబడి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గతంలో సమాజ్వాదీ పార్టీ టికెట్పై గెలిచి, జెడి(యు)లో చేరిన జామా ఖాన్ను నితీష్ కుమార్ మంత్రివర్గంలో చేర్చారు కానీ ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఎన్డీఏ నాయకులు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యల దృష్ట్యా, ముస్లిం అభ్యర్థులను మినహాయించడాన్ని రాజకీయ పరిశీలకులు చూస్తున్నారు.
2024 లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ ముజఫర్పూర్లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు మైనారిటీ వర్గాలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఓటు వేయలేదని, అయినప్పటికీ ఆయన వారి కోసం పని చేస్తూనే ఉన్నారన్నారు. దాదాపు అదే సమయంలో, సీతామర్హి ఎంపీ దేవేష్ చంద్ర ఠాకూర్ యాదవులు, ముస్లింలు తనకు మద్దతు ఇవ్వనందున తాను ఇకపై వారి కోసం పని చేయనని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనలు ముస్లిం ఓటర్లతో నితీష్ కుమార్ సమీకరణం ఎలా ఉందో అనే ఊహాగానాలకు దారితీశాయి. వక్ఫ్ బోర్డు సమావేశానికి ఆయన లేకపోవడం చర్చకు మరింత ఆజ్యం పోసింది.
అయితే, ఇటీవలి నెలల్లో, ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ముస్లిం సమాజం నిర్వహించిన అనేక కార్యక్రమాలకు హాజరవుతూ విశ్వాసాన్ని తిరిగి నిర్మించడానికి ప్రయత్నాలు చేశారు. జేడీ(యు) మొదటి జాబితాలో ముస్లిం అభ్యర్థులు లేకపోవడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఎ ఓటర్ల స్థావరాల వైపు వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణగా వ్యాఖ్యానించబడుతోంది. బీహార్లో నవంబర్ 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.