08-01-2026 12:00:00 AM
ఏసీపీ చక్రపాణి
ఉప్పల్, జనవరి 7 (విజయక్రాంతి) : శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించాలని డీజే సౌండ్ సిస్టం ఆపరేటర్లకు ఉప్పల్ ఏసిపి ఎస్ చక్రపాణి సూచించారు. బుధవారం రోజున ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న ఫంక్షనల్ డీజే ఆపరేటర్స్ తో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శబ్ద కాలుష్యం సంబంధించిన నిబంధనలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.. అనంతరం నాచారంలో అర్ధరాత్రి వరకు డీజే నిర్వహిస్తే చర్యలు తప్పవని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ప్రభాకర్ రెడ్డి మై బల్లి పాల్గొన్నారు