calender_icon.png 9 January, 2026 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రి చితికి తలకొరివి పెట్టిన కూతురు

08-01-2026 12:00:00 AM

కేసముద్రం, జనవరి 7 (విజయక్రాంతి): అనారోగ్యంతో రిటైర్డ్ ఏఎస్ ఐ బైరు మురళి బుధవారం ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో మరణించారు. మృతుడికి ఇద్దరు కూతుర్లు లావణ్య, కళ్యాణి ఉండగా, తండ్రి చితికి పెద్ద కూతురు లావణ్య తల కొరివి పెట్టింది. ఈ సంఘటన చూసి గ్రామస్తులు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.